Bollywood: రేవ్ పార్టీలో మునిగితేలిన సినీ తారలు.. ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇష్యూ అనేది చాలా కాలంగా పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో పలువురు సినీ తారలపై విచారణ కూడా జరిగింది. పలువురు హీరోయిన్ల పై కూడా ఆరోపణలు రావడం బాలీవుడ్ పై చెరపలేని మచ్చగా మార్చింది. అంతేకాదు పలువురు అగ్ర హీరోలు సైతం డ్రగ్స్ తో దొరికిన దాఖలాలు ఉన్నాయి. అయితే తాజాగా ముంబైలో జరిగిన రేవ్ పార్టీ గురించి ఫోటోలు వైరల్ కావడం మరోసారి చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. క్రిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉమైర్ సంధు అనే వ్యక్తి చేసే రచ్చ అయితే అస్సలు తట్టుకోలేం. హీరోలు, హీరోయిన్స్ పై ఉమైర్ సందు చేసే ఆరోపణలు సంచలనం సృష్టిస్తుంటాయి. తాజాగా ముంబైలో సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ ఇతను చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారు మత్తులో ఉన్నట్లు కనిపించే ఫోటోలని ట్వీట్ చేయడంతో సంచలనంగా మారింది.

ఏప్రిల్ 7వ తేదీన ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ.. ” గత రాత్రి ముంబైలో సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్, సె** పార్టీలో మునిగి తేలారు. పార్టీలో పాల్గొన్న వారు విపరీతంగా మద్యం సేవించి మత్తులో మునిగితేలారు. ఊరి అనే దళారీ వారికి అన్నిటిని సమకూర్చాడు. ఈ పార్టీలో భూమి పడ్నేకర్, ఖుషి కపూర్, ఇతర సంపన్న వర్గాల పిల్లలు కూడా ఉన్నారు. వారంతా డ్రగ్స్ తీసుకున్నారు” అంటూ సంచలన ఆరోపణలతో ట్వీట్ చేశాడు ఉమైర్ సంధు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు