Richa Chadda : సారీ చెప్పినా.. ముదురుతోంది

బాలీవుడ్ నటి రీచా చద్దా.. హిందీలో మూవీస్, వెబ్ సిరీస్ ఎక్కువగా చేస్తుంది. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రీచా చద్దా. ఈమె ఇటీవల లాహోర్ కాన్ఫిడెన్షియల్ అనే ఓటీటీ సినిమాలో నటించింది. ఇది 2020 లో వచ్చిన లండన్ కాన్ఫిడెన్షియల్ సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో జీ5లో స్ట్రీమింగ్ అయింది. ఇది ఇలా ఉండగా, ఈ పంజాబీ బ్యూటీ చేసిన ఒకే ఒక్క కామెంట్ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది.

అదేంటంటే భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. దీనినే పిఓకే అంటున్నారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ ని వెనక్కి పంపడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే ఆపరేషన్ త్వరగా ముగిస్తామని నార్త్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఇటీవల మాట్లాడారు. దీనిని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

దీనిని రీచా రీట్వీట్ చేస్తూ.. “గల్వాల్ సేస్ హాయ్ ” అని ట్వీట్ చేసింది. ఇది కాస్త ఇప్పుడు దుమారం అయిపోయింది. సైన్యాన్ని కించపరిచేలా నటి ట్వీట్ ఉందని రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈమె చేసిన ట్వీట్ పై టాలీవుడ్ హీరోలు నిఖిల్, మంచు విష్ణు ఆమెపై మండిపడ్డారు. “20 మంది సైనికులు గల్వన్ లో ప్రాణాలు కోల్పోయారు. అది తలుచుకుంటే ఇంకా కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను పక్కనపెట్టి సైనికులను గౌరవించాలి. రిచా ఇది తెలుసుకోండి.. దేశం తర్వాతే ఏదైనా ” అంటూ ఆమెకు హితబోధ చేశారు. కాగా దీనిపై ఇప్పటికే రీచా ఆర్మీకి క్షమాపణలు చెప్పింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు