Mohan Lal : మరో సీక్వెల్ ఫిక్స్

భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు ఉంటాయి. కథ, కథనం బాగున్న వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చాలా వరకు సీక్వెల్ సినిమాలు పరాజయాన్ని చూస్తాయి. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలు అందుకొని హిట్ అవుతాయి. అలాంటి అతి తక్కువ సినిమాల్లో “దృశ్యం” సినిమా ఒకటి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి.

తాజాగా మూడో భాగంతో తాము తిరిగి వస్తున్నామని నిర్మాత అంటోనీ పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు. దృశ్యం సినిమా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయింది. రీమేక్ అయిన ప్రతి చోట కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కథే ఈ దృశ్యం.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ రెండు పార్ట్ లకు కొనసాగింపుగా “దృశ్యం 3” రానుంది. అభిమానులు ఈ పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే షూటింగ్ కి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దృశ్యం 3 మాతృక వస్తే.. తెలుగులో వెంకటేష్ హీరోగా దీన్ని రీమేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు