Alia : సీక్వెల్ లో అతిథి కాదు

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం ఇటీవల మాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర.. కలెక్షన్లను కూడా బాగానే రాబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ 360 కోట్లకు పైగానే రాబట్టింది. విడుదలకు ముందు హీరో హీరోయిన్లు రణ్ బీర్ కపూర్, అలియా భట్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తోపాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దేశవ్యాప్తంగా ప్రమోషన్లు విపరీతంగా చేశారు.

విడుదల తర్వాత కూడా బ్రహ్మాస్త్ర చిత్ర యూనిట్ ప్రమోషన్లను తగ్గించడం లేదు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. బ్రహ్మాస్త్ర హీరో హీరోయిన్లు, రియల్ కపుల్ రణ్ బీర్ కపూర్ అలియా భట్ క్షణం తీరిక లేకుండా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

బ్రహ్మాస్త్ర 2లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కీలకపాత్ర చేయాలని తాను కోరుకున్నట్టు అలియా భట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాగా బ్రహ్మాస్త్రం మొదటి భాగంలో దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసింది. దీంతో బ్రహ్మాస్త్ర రెండో భాగంలో దీపికా పదుకొనే పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సినీ విశ్లేషకులు ముందుగానే అభిప్రాయపడ్డారు.

- Advertisement -

తాజాగా హీరోయిన్ అలియా భట్ దీపికా పదుకొనే పాత్రపై చేసిన వ్యాఖ్యలతో.. బ్రహ్మాస్ర రెండో భాగంలో దీపిక పాత్ర ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది. కాగా బ్రహ్మాస్త్ర రెండో భాగం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. మొదటి భాగం కంటే రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీక్వేల్ లో దీపికా పదుకునే, షారుఖాన్ తోపాటు చాలామంది అగ్ర నటీనటులు ఉండబోతున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు