Anasuya : నా కోడలు కూడా పిలవద్దు

బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ ఇప్పుడు సినిమాలతో మరింత బిజీ అయింది. క్షణం, రంగస్థలం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి.. సెకండ్ పార్ట్ లో తన రోల్ కి మరింత ప్రాముఖ్యత ఉంటుందని చెబుతోంది. ఇక అనసూయకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తోంది.

దీనికి గల కారణం ఓ హీరో అభిమానులు ఆమెను టార్గెట్ చేయడమే. తమ హీరోను టార్గెట్ చేస్తూ అనసూయ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనసూయ ను “ఆంటీ” అని సంబోధించారు. దీనిపై అనసూయ ఫైర్ అయ్యింది. తనను ఆంటీ అంటూ వయసు ఆధారంగా టార్గెట్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు పెడతానని చెప్పింది. అలాగే తనపై ట్రోలింగ్ పెరిగే కొద్దీ తాను, తన ఫ్యామిలీ మరింత స్ట్రాంగ్ గా మారినట్లు అనసూయ తెలిపింది.

ఇదిలా ఉంటే అనసూయ తాజాగా యాంకర్ సుమ నిర్వహించే ” క్రేజీ కిచెన్” కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆంటీ టాపిక్ వచ్చింది. దీనిపై అనసూయ మాట్లాడుతూ.. ” వాస్తవానికి నాకు అత్త, పిత్త అని పిలిపించుకోవాలని లేదంటూ చెప్పుకొచ్చింది. అందరూ తనని అనసూయ లేదా అను అని పిలవాలని సూచించింది. “చివరికి నా కోడలైనా కూడా” అని చెప్పడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు