అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షశివో’. దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ చిత్రం యూత్కి ఎట్రాక్ చేసిందని, శిరీష్, ఇమ్మాన్యుయేల్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం.. రివ్యూలు కూడా పాజిటివ్గానే రావడం కలిసొచ్చింది.
అల్లు శిరిష్ తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఊర్వశివో రాక్షశివో నిలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్ లు ఎక్కువగా చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ హాజరైనప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. వాటికి తోడు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లడంతో మంచి సక్సెస్ సాధించిందనే చెప్పవచ్చు. అల్లు శిరీష్ చిత్రానికి అన్న అల్లు అర్జున్ ఒక్కసారి కూడా కనిపించలేదని మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే సక్సెస్ మీట్కి అల్లు అర్జున్ హాజరువుతున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 06న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయబోతుంది చిత్ర యూనిట్. ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గీతా ఆర్ట్స్ 2, శ్రీతిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.