Aishwarya – Dhanush: పిల్లల్ని ధనుష్ ఇకపై కలవలేరా..?

Aishwarya – Dhanush.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ధనుష్, ప్రముఖ లేడీ డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో గత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రజనీకాంత్ హీరో ధనుష్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. కానీ కారణాలు చెప్పకుండా విడిపోయి అభిమానులకు ఆశ్చర్యాన్ని మిగిల్చారు. అయితే విడాకులు ప్రకటించిన తర్వాత నుంచి విడివిడి గానే ఉంటూ ఎవరి కెరియర్ లో వారు బిజీగా మారిపోయారు. ఇకపోతే తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ లోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్న మొదలైంది.

aishwarya rajinikanth latest news
aishwarya rajinikanth latest news

పిల్లల బాధ్యత ఎవరిది..?
ఇక విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పిల్లలను పోషించే బాధ్యత తనకే అప్పగించాలని ఐశ్వర్య రజనీకాంత్ కూడా డిమాండ్ చేస్తున్నారు.. కానీ పిల్లల బాధ్యత పై ఇద్దరు ఒక క్లారిటీతో ఉన్నారట.. ఈ క్రమంలోనే ఐశ్వర్య తనకు పిల్లల బాధ్యతను అప్పగించాలని కోరిందట. దానికి ధనుష్ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తాజా సమాచారం.. ఇకపోతే పిల్లల బాధ్యతను ఐశ్వర్య తీసుకుంటే.. ధనుష్ ఇక తన పిల్లలను కలవలేరా అనే అనుమానం మళ్ళీ మొదలైంది.. దీనిపై ఈ జంటే క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇకపోతే ఈ దంపతులకు యాత్ర , లింగ అనే పిల్లలు ఉన్నారు.. మొదటి కొడుకు యాత్రకు 18 సంవత్సరాలు.. త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తీసుకోబోయే ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

కెరియర్లో బిజీగా మారిన ఐశ్వర్య – ధనుష్ :
మరోవైపు ధనుష్ – ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఇంకా వెల్లడించలేదు. ఐశ్వర్య మాత్రం తన సినిమా డైరెక్షన్లో బిజీగా ఉండగా.. ధనుష్ మాత్రం తన వరుస సినిమాలతో మరింత బిజీగా మారిపోయారు.. ప్రస్తుతం ధనుష్ వరుసగా సినిమాలలో నటిస్తూ తెలుగు, తమిళ్, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లో కూడా కాలు మోపి తన ప్రతిభ ఏంటో నిరూపిస్తున్నారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల తన తండ్రితో లాల్ సలాం సినిమాలో తీసిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. ఇక ఇందులో తన తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ పోషించారు. తన తండ్రి పాత్రకు తగ్గట్టుగా చివర్లో కథను మార్చడం వల్లే కథ డిజాస్టర్ అయ్యింది అంటూ ఐశ్వర్య రజనీకాంత్ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో సక్సెస్ కొట్టే దిశగా అడుగులు వేస్తోంది ఐశ్వర్య రజనీకాంత్.. ఇకపోతే ప్రస్తుతం విడాకులు తర్వాత పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే విషయంపై ధనుష్ – ఐశ్వర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు