Ahimsa: ఏ నమ్మకంతో రిలీజ్ చేస్తున్నట్టు?

దగ్గుపాటి రానా తమ్ముడు అభిరాం ని పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించిన చిత్రం “అహింస”. ప్రముఖ డైరెక్టర్ తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, చాలా రోజుల తరువాత ఆర్.పి పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. గీతికా తివారి అనే కొత్త హీరొయిన్ ఈ సినిమాతో పరిచయం అవుతుంది. విలేజ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 2న విడుదల చేస్తున్నారు. అయితే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై రావాల్సిన హైప్ కొంచెం కూడా పెరగలేదు.

అహింస సినిమాకి సంబంధించిన టీజర్ గాని, ట్రైలర్ గాని ఏవి సినిమాపై అంచనాలను పెంచలేకపోయాయి. వాటిని చూస్తుంటే ఎదో పదేళ్ల కింద తీసిన సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా తక్కువ క్వాలిటీ తో ఈ సినిమాను తెరకెక్కించారని తెలిసిపోతుంది. ఇక రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ తేజ కూడా ఈ సినిమా పై అపనమ్మకం గా ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమాను హీరో కోసమో, తన కోసమో తీయలేదని, రామా నాయుడు కి ఇచ్చిన మాట కోసమే తీశానని అన్నాడు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా వెంకటేష్ గెస్ట్ గా ఒక ప్రెస్ మీట్ ని కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా మూవీకి సంబంధించిన యూనిట్ టెక్నికల్ సిబ్బంది, నటీనటులు ఎక్కువ మంది లేకపోవడం గమనార్హం. ప్రెస్ మీట్లో కూడా విలేఖర్లు అడిగే ప్రశ్నలకు యాక్టీవ్ గా సమాధానాలు ఇవ్వలేకపోయారు. మరి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోతే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడమెందుకు, ఓటీటీ లో రిలీజ్ చేసుకోవచ్చుగా అని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా ఈ చిత్రం పై హోప్స్ పెట్టుకునేవారు ఎవరంటే అది హీరో,హీరోయిన్లనే చెప్పాలి. మరి అహింస సినిమా ఫలితం ఏమవుతుందో తెలియాలంటే జూన్ 2 వరకు ఆగాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు