టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఏమాయే చేశావే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ సినిమా హీరో అయినటువంటి నాగచైతన్యను ప్రేమించింది. 2017లో వీరి పెళ్లి జరిగింది. 2021 అక్టోబర్లో విడాకులు ప్రకటించారు. విడాకులు ప్రకటించిన తరువాత ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటేడ్ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే లేడీ ఓరియెంటేడ్ మూవీస్ అయినటువంటి యూటర్న్, ‘ఓబేబీ’ లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది.
గత కొంత కాలం నుంచి సమంత స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గతంలో పలుమార్లు వార్తలు వినిపించిన విషయం విధితమే. ఇటీవలే చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లినట్టు సమాచారం. అమెరికా నుంచి వారం రోజుల లోపే తిరిగి రానుందట. ఆమె వచ్చిన వెంటనే యశోద డబ్బింగ్ పనుల్లో నిమగ్నం కానున్నట్టు సమాచారం.
సమంత నటించాల్సిన ‘ఖుషి’ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. సమంత అమెరికా వెళ్లడంతో ఖుషి సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత యశోద డబ్బింగ్తో పాటు ఖుషి సినిమా షూటింగ్ కూడా జరుగనుంది. మొత్తానికి దసరా తరువాత సమంత తన సినిమాల్లో బిజీగా ఉండనున్నట్టు తెలుస్తోంది.