Pushpa2: పరస్పర అంగీకారంతోనే విడిపోయాం… పుకార్లపై రష్మిక క్లారిటీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా… ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్. ఈమె ఏది మాట్లాడినా, ఏం చేసినా, కాస్త వివాదాస్పదం, కాస్త ట్రోల్స్, ఇంకాస్త కాంట్రవర్సీ అవుతుంటుంది. అందుకే రష్మిక ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా రష్మిక పేరు ఎక్కువగా వినిపించింది. అదే రష్మిక దాదాపు 80 లక్షల వరకు తన మేనేజర్ చేతిలో మోసపోయిందని. దాదాపు రెండు మూడు రోజులు రష్మిక మోసపోయింది అంటూ న్యూస్ తెగ వైరల్ అయింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అందరూ ఇదే నిజమని ఫిక్స్ అయిపోయారు.

తాజాగా దీనిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందించారు. తనకు, తన మేనేజర్ మధ్యలో ఎలాంటి గొడవ జరగలేదని, తనను 80 లక్షల మోసం ఎవరూ చేయాలేదంటూ పుకార్లపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. పరస్పర అంగీకారంతోనే మేనేజర్ తన ఉద్యోగం వదిలి వెళ్లాడంటూ ఒక నోట్ ను రష్మిక విడుదల చేసింది. దీంతో గత కొద్ది రోజుల నుంచి రష్మిక – తన మేనేజర్ పై వస్తున్న వార్తలకు బ్రేకులు పడ్డాయి.

కాగా, రష్మిక మందన్నా వద్ద ఓ వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనే రష్మిక సినిమాల డేట్స్, అడ్వటైజ్ మెంట్స్, రెమ్యునరేషన్స్ అలా అన్ని చూసుకునే వాడు. కానీ, ఈ మధ్యలో వీరి మధ్య విభేదాలు వచ్చాయని పుకార్లు వచ్చాయి. అలాగే తెలుగులో చాలా అవకాశాలు తన మేనేజర్ వల్లే పోయాయని రష్మిక అగ్రహం వ్యక్తం చేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక ఇచ్చిన క్లారిటీతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ పుకార్లని తెలిసిపోయింది.

- Advertisement -

కాగా, రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప పార్ట్ 2 చేస్తుంది. బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న యానిమల్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల కానుంది. ఇదే కాకుండా, తెలుగులో మరో సినిమాకు సైన్ చేయడానికి రెడీ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు