టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దాదాపు అందరికీ పరిచయమే. డాలర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి హిట్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ముల. 2021లో నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన లవ్స్టోరీ తరువాత మళ్లీ సినిమా తీయలేదు శేఖర్ కమ్ముల.
ప్రధానంగా శేఖర్ కమ్ముల ఒక కథపై చాలా రోజుల నుంచి కసరత్తులు చేస్తుంటాడు. బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఈలోపు ఈయన ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవు. సినిమాకి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించదు. ఇది ఈ దర్శకుడి స్టైల్. ఇటీవలే తమిళ హీరో ధనుష్తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా అని అందరూ చర్చించుకోవడం విశేషం.
శేఖర్ కమ్ముల ఎప్పటి మాదిరిగానే తన ప్రాజెక్ట్కి సంబంధించిన పనులను చకచకా చేసుకుంటూ వస్తున్నారట. ఆయన స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేశారని.. సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు ముగింపు దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్పైకి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ధనుష్ ఓ వైపు తమిళ సినిమాలను లైన్ లో పెడుతూనే.. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తరువాత శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్నటట్టు తెలుస్తోంది. ధనుష్తో శేఖర్ కమ్ముల తీసే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.