Eagle: డిజాస్టర్ తర్వాత కూడా తగ్గేది లే అంటున్న రవితేజ..!

మాస్ మహారాజ రవితేజ ఇటీవల రావణాసుర సినిమాతో డిజాస్టర్ చవిచూసిన సంగతి తెలిసిందే. సాధారణంగా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజ వరుసగా సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న రవితేజ తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాలో నటించనున్నాడు. అయితే, డిజాస్టర్ వచ్చినప్పటికీ రవితేజ రెమ్యునరేషన్ అమాంతం పెంచేసాడని టాక్ వినిపిస్తోంది. కలర్ ఫోటో సినిమా ఫేమ్ సందీప్ డైరెక్షన్లో కమిట్ అయిన సినిమా కోసం రవితేజ 25కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని సమాచారం అందుతోంది.

రవితేజతో ధమాకా సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న పీపుల్స్ మీడియా సంస్థనే ఈ సినిమా కూడా నిర్మించనుంది. రవితేజ హిట్ ఇచ్చాడు కాబట్టి నిర్మాత అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడ్డాడని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఏ సినిమాలో రవితేజతో పాటు శర్వానంద్ కూడా నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇటీవల విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాల గ్లింప్స్ ఆకట్టుకోవడంతో సినిమాలపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన క్రమంలో రవితేజ కూడా తన సినిమాలను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసాడు. టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుండగా, ఈగల్ సినిమా 2024 సంక్రాంతికి సందడి చేయనుంది. మరి, రెమ్యునరేషన్ పెంచిన రవితేజ తర్వాతి సినిమాలతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు