Kollywood: ప్రభుదేవాకు రెండో పెళ్లి.. బయటపడ్డ అసలు నిజం

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. హీరోగా, డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ పొందిన ప్రభుదేవా వ్యక్తిగత జీవితం మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా తన మొదటి భార్యతో గొడవలు, డైవర్స్.. ఆ తరువాత హీరోయిన్ నయనతార తో ప్రేమాయణం.. ఇలా తరచుగా ఆయన వార్తల్లోనే ఉన్నారు.

ప్రభుదేవా రమాలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాక వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. కానీ కొడుకు విశాల్ 13 సంవత్సరాల వయసులోనే ప్రాణాంతక వ్యాధితో చనిపోయారు. ఇక కొడుకు చనిపోయిన బాధలో ప్రభుదేవా చాలా రోజులు ఉన్నారు. ఆ తరువాత ప్రభుదేవతో నయనతార ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ప్రభుదేవా కోసం నయనతార హిందూమతంలోకి కూడా మారింది. ఇక వీరిద్దరికీ వివాహం కూడా అవుతుందనుకున్న సమయంలో మొదటి భార్య విడాకులకు ఒప్పుకోలేదు. ఆ తరువాత నయనతారను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో వీరి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది.

ఇక 2011లో తన మొదటి భార్యతో ప్రభుదేవా విడాకులు తీసుకున్నాడు. అయితే ప్రభుదేవా కరోనా సమయంలో ఎవరికీ తెలియకుండా హిమానిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం డాన్స్ మాస్టర్, ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం కారణంగా బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తాజాగా ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా హిమాని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రభుదేవా ని పెళ్లి చేసుకోవడం తన లక్ అని, ప్రభుదేవతో తన జర్నీ మూడేళ్లు పూర్తయిందని, ప్రభుదేవ ని పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అతనిని పొగుడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఇటీవల ఈ జంట తిరుమలలో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు