ఒక పక్క రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమా షూటింగ్లు మొదలుపెడుతూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే మొదలు పెట్టినంత స్పీడ్ గా షూటింగ్ పూర్తి చెయ్యట్లేదు పవన్, అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట క్రిష్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది. ఒకానొక దశలో సినిమా అటకెక్కింది అంటూ కూడా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడిందంటూ వార్తలొస్తున్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా కోసం చాలా బడ్జెట్ పెట్టాల్సి వస్తోందని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తూ ఉండటం, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం వల్ల అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు పెరిగిందని అంటున్నారు. దీంతో ఫైనాన్షియర్స్ కోసం వెతికే పనిలో నిర్మాత ఉండటంతో సినిమా షూటింగ్ వాయిదా వెయ్యాల్సి వచ్చిందని సమాచారం. ఇక చేసేదేమీ లేక ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నారని అంటున్నారు.
అన్నీ అనుకున్నట్టు సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికి ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా మొదట్లో సింగిల్ పార్ట్ గానే మొదలైన ఈ సినిమా ఎంత షూట్ చేసినా కూడా ఓ కొలిక్కి రాకపోవటంతో హరిహరవీరమల్లు సినిమాను రెండు భాగాలుగా తీయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఫస్ట్ పార్ట్ సంబందించిన సీన్లు దాదాపు పార్తయ్యాయని, పెండింగ్ ఉన్న క్లైమాక్స్ పార్ట్ కోసం తుది మెరుగులు దిద్దే పనిలో డైరెక్టర్ క్రిష్ నిమగ్నం అయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది చివరికంతా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోతే, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ పనుల్లో బిజీ అయిపోతే మరో రెండేళ్లు ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, క్రిష్ ఏఎమ్ రత్నం మాత్రం ఈ సినిమాను ఈ ఏడాది చివరికి ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారట.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News