Bhola Shankar: మారని మెహర్ రమేష్ తీరు – నిర్మాతకు తిప్పలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాకు రీమేక్ గా భోళాశంకర్  సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య హిట్ అయిన జోష్ లో ఉన్న చిరంజీవి ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుండగా తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే, సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతోందట. బడ్జెట్ విషయంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కంట్రోల్ చేయకపోవటంతో విసుగు చెందిన నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ బాధ్యతలు తన సన్నిహితుడికి అప్పగించి అమెరికాకి వెళ్లారట.

బడ్జెట్ పరిధి దాటి ఖర్చు పెట్టించటం మెహర్ రమేష్ కి ఇది కొత్త కాదు గతంలో శక్తి, బిల్లా సినిమాల విషయంలో కూడా ఇలాంటి టాక్ వినిపించింది. సుమారు 13ఏళ్ల తర్వాత మెగాస్టార్ లాంటి హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చినా మెహర్ రమేష్ తీరు మారకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మెహర్ రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే రీమేక్ సినిమా కావటంతో మెగా ఫాన్స్ ఈ సినిమా పట్ల నిరుత్సాహంగా ఉంటె ఉప్పుడు వార్త మరింత నిరుత్సాహ పరిచేలా ఉంది. మరో పక్క చిరంజీవి కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తన కొత్త ప్రాజెక్ట్స్ ఏవి అనౌన్స్ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా అనౌన్స్ చేసిన సమయం నుండే చిరంజీవి మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వటం పట్ల నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. అందులోను చిరంజీవి కి ప్రాఫిట్ షేర్ ఇచ్చేందుకు ఒప్పుకొని నిర్మాత అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ పరిధి దాటిపోయింది అంటూ వస్తున్న వార్తలు నిజమే అయితే మెహర్ రమేష్ వల్ల నిర్మాతకు తిప్పలు తప్పేలా లేవు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు