Prabhas: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ వెనక స్ట్రాటజీ అదేనా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. జూన్ 16న రిలీజ్ కి ప్లాన్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్. నిజానికి ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు రావటంతో కొంత గ్యాప్ తీసుకొని విజువల్ ఎఫెక్ట్స్ కి మెరుగులు దిద్ది విడుదలకు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆదిపురుష్ ట్రైలర్ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్, దేశవ్యాప్తంగా 100కి పైగా స్క్రీన్లతో పాటు అమెరికా, కెనడా వంటి 70కి పైగా దేశాల్లో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇంత పెద్ద ఎత్తున ట్రైలర్ లాంచ్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించింది ఆదిపురుష్.

ఈ సినిమా ట్రైలర్ ని నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా, ఇంత పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయటం వెనక నిర్మాత స్ట్రాటజీ ఉందని అంటున్నారు. టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేస్తే విజువల్ ఎఫెక్ట్స్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ట్రైలర్ విషయంలో అలా జరగకుండా మొదట ప్రభాస్ సన్నిహితులకు, అభిమానులకు చూపించి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇది ఒకరకంగా మంచి ప్లాన్ అయినప్పటికీ, యూట్యూబ్ రిలీజ్ ఒక రోజు గ్యాప్ తీసుకోవటం వల్ల థియేటర్లో రికార్డ్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి యూట్యూబ్ లో చూసే ఆడియెన్స్ కి ఫ్రెష్ ఫీల్ మిస్సయ్యే ఛాన్స్ ఉంది.టీజర్ వల్ల జరిగిన డ్యామేజ్ ని ట్రైలర్ తో కంట్రోల్ చేయాలనీ సినిమా మేకర్స్ వేసిన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ గత చిత్రం రాధే శ్యామ్ ఆశించిన స్థాయిలో అలరించకపోవటం వల్ల అభిమానులు ఆదిపురుష్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు