Samantha : భయపెట్టనుందా ?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ఏం మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత, తర్వాత తన తొలి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్యనే ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఈ పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. పెళ్లి అనంతరం నాలుగేళ్ల తర్వాత ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు. పెళ్లికి ముందే అగ్ర హీరోయిన్ గా ఉన్న సామ్, విడాకుల తర్వాత తన స్పీడ్ మరింత పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.

గ్లామర్ పాత్రలు, ఐటెం సాంగ్స్ తో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా అడుగుపెట్టడానికి ఈ భామ రెడీ అయిపోయింది. ప్రస్తుతం సామ్ బాలీవుడ్ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒకటి.. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన సిటాడెల్ కు ఇండియిన్ వెర్షన్. దీనిలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది.

దీని తర్వాత బాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా తొలి చిత్రం చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా కనిపించనున్నారు. రాజస్థాన్ నేపథ్యంలో వచ్చే సినిమాలో సామ్ రెండు పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పాత్ర రాజ్ పుత్ రాణిగా ఉంటుందని, మరో పాత్ర దెయ్యంగా ఉంటుందని సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుందని, దీనిపై త్వరలనే అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు