టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా ఏ.ఆర్. మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం “ఇట్లు మారెడుపల్లి ప్రజానీకం”. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. టీజర్ లో అల్లరి నరేష్ మారేడుమిల్లిలో ఎన్నికల విధులను నిర్వహించే ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాడు. అల్లరి నరేష్ తొలిసారి ఇలాంటి పాత్రలో కనిపించడంతో అంచనాలు పెరిగాయి.
ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. నవంబర్ 11న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ని విడుదల చేశారు. నవంబర్ 11న విడుదలవుతుందని అనౌన్స్మెంట్ చేసిన పోస్టర్ నరేష్, అతని సహచరులు, పోలీస్ అధికారులతో కలిసి ఓ గిరిజన ప్రాంతంలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ట్రైలర్ రాలేదు. ఇంకా ప్రమోషన్ల ను స్టార్ట్ చేయనేలేదు. ఇలాంటి సందర్భాల్లో ఈ సినిమా నవంబర్ 11న విడుదల అవుతుందా అంటే.. కచ్చితంగా లేదు అని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఒక సినిమా విడుదలవుతుందంటే దాదాపు రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలవుతుంది. కానీ ఎలాంటి హంగామా లేని ఇట్లు మారెడుపల్లి ప్రజానీకం విడుదల అవుతుందా లేదా అని అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం యూనిట్ విడుదల తేదీని మార్చుకుందట. ఇంకా పొస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేక పోవడం వల్లే అప్డేట్స్ ను ఇవ్వలేరని తెలుస్తోంది. పోస్ట్ పొడక్షన్ పనులు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇచ్చి మంచి బజ్ ను క్రియేట్ చేసి విడుదల చేస్తారని టాక్. మరి ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తారో.. లేదా సంక్రాంతి తర్వాత విడుదల చేస్తారో.. చూడాలి.