Megastar: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో మామ – అల్లుళ్ల హవా మాములుగా లేదు..!

ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వంటి  వరుస బ్లాక్ బస్టర్స్ తో ప్రారంభమై శుభారంభాన్ని అందుకున్న టాలీవుడ్ కి వేసవిలో మాత్రం దసరా, విరూపాక్ష మినహా రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవటంతో నిరాశ మిగిల్చింది. మిగతా హీరోల సంగతి పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది అధిక లాభాలు సాధించిన సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య 48కోట్ల రూపాయల ప్రాఫిట్ అందుకొని లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలువగా తేజ్ నటించిన విరూపాక్ష సినిమా 25కోట్ల లాభాలతో టాప్ 5 లిస్ట్ లో స్థానం సొంతం చేసుకుంది. అంతే కాకుండా తేజ్ కెరీర్లో తొలి 100కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా కూడా విరూపాక్ష నిలిచింది.
తొలిరోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య  48కోట్ల ప్రాఫిట్ తో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలువగా, సమ్మర్ సీజన్ బిగినింగ్ లో రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా 25కోట్ల ప్రాఫిట్ రాబట్టి ఈ ఏడాది సమ్మర్ రిలీజెస్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో, మెగా ట్యాగ్ ని నిలబెట్టాడు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తేజ్, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న విడుదలకి సిద్ధంగా ఉండగా, చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ లో అదరగొట్టిన మామా అల్లుళ్ళు సెకండ్ హాఫ్ లో బ్లాక్ బస్టర్స్ అందుకొని హిట్ల పరంపర కొనసాగించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మామా అల్లుళ్ళ గత చిత్రాలు రెండు స్ట్రైట్ సినిమాలు కావటం, ఇప్పుడు రాబోతున్న సినిమాలు రెండు రీమేక్స్ అవ్వటం యాదృచ్చికమే అయినప్పటికీ అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి, ఫస్ట్ హాఫ్ లో బ్లాక్ బస్టర్స్ తో అలరించిన చిరు, తేజ్ లు సెకండ్ హాఫ్ లో ఆ ఊపు కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు