Malli Pelli: రమ్య రఘుపతికి అసలు రంగు తెలిస్తే షాక్ అవుతారు..!

సీనియర్ నటుడు నరేష్, అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య నడుస్తున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నాడన్న విషయం తెలిసినప్పటి నుండి రమ్య రఘుపతి తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నరేష్, పవిత్ర నటించిన మళ్ళీ పెళ్లి సినిమా విడుదల సమయంలో కోర్టుని ఆశ్రయించి సినిమా విడుదల కాకుండా ఆపాలని ప్రయత్నించింది కానీ, వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో రమ్య రఘుపతి గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రమ్యని పెళ్లి చేసుకున్న నాటి నుండి నరేష్ ఆర్థికంగా రమ్యకి ఎంతో సపోర్ట్ గా నిలిచాడట. బ్యూటీ పార్లర్ వంటి బిజినెస్ లు చేసేందుకు నరేష్ పలు మార్లు ఆర్థిక సాయం చేసాడట. పెళ్లి సమయంలో విజయనిర్మల బంగారం అంతా రమ్యకి ఇవ్వగా, ఆ బంగారాన్ని కూడా అమ్ముకుందని సవ్యయంగా నరేష్ వెల్లడించాడు.
రమ్య, నరేష్ ల పేరు మీద ఉన్న జాయింట్ అకౌంట్ నుండి సుమారు 50లక్షల రూపాయలు మాయం చేయటమే కాకుండా ఆ అకౌంట్ పై కోటి రూపాయల లోన్ కూడా తీసుకొని ఎగ్గొడితే, ఆ లోన్ నరేష్ కట్టాల్సి వచ్చిందట. అంతే, కాకుండా విడాకుల టాపిక్ వచ్చినప్పుడల్లా నరేష్ పర్సనల్ విషయాలు బయట పెడతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంటుందంట. బెంగళూరులో ఉంటున్న రమ్య కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యక్తితో అక్రమసంబంధం కూడా పెట్టుకుందని టాక్ ఉంది.
రమ్య రఘుపతి పెట్టే ఎమోషనల్ టార్చర్ భరించలేకనే నరేష్ పవిత్రకి దగ్గరయ్యాడట. నరేష్ కి విడాకులు ఇస్తే పవిత్రను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడని, అది భరించలేనని భావించిన రమ్య విడాకులకు సహకరించటం లేదట. మొత్తం మీద నరేష్, రమ్యల వ్యవహారం మహేష్ బాబుతో పాటు ఘట్టమనేని కుటుంబానికి తలనొప్పిగా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించేలా రోజుకో ట్విస్ట్ బయటపడుతున్న ఈ వివాదానికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు