Guntur Kaaram: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఎపిసోడ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నప్పటికీ రెండడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నట్టు వివిధ కారణాల చేత పలుమార్లు వాయిదా పడుతూ వస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యింది. దీనికి తోడు హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో నెలకొన్న గందరగోళం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టడం, ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేయటం పట్ల మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అడుగడుగునా ఆటుపోట్లు ఎదుర్కుంటూ నిరుత్సాహంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మరోసారి కబడ్డీ ఆడుతూ కనిపించనున్నాడట. గతంలో మహేష్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నాళ్ల తర్వాత తమ అభిమాన హీరో మళ్ళీ కబడ్డీ సీన్స్ లో కనిపించనున్నాడన్న వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతోంది.

ఫస్ట్ షెడ్యూల్ లోనే కబడ్డీ సీక్వెన్స్ కి సంబంధించిన సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో గురూజీ ఈ స్పెషల్ సీక్వెన్స్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అన్న ఆసక్తి నెలకొంది. 2024 సంక్రాతి రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.మరి, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా వస్తున్న గుంటూరు కారం సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు