Guntur Kaaram: మళ్ళీ మేసేజా – ఇక ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్ కి వెళ్లక తప్పదా..?

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం కిందట మొదలైనప్పటికీ పలు కారణాల వల్ల చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమా యూనిట్ 2024సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని ఈ వినాయక చవితికి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళిత, ఇటీవలే హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు సంబందించిన షూటింగ్ జరిగిందని, ఆ సీన్స్ కోర్ట్ సెటప్ లో ఉన్నాయని, మహేష్ గత సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తోంది. మహేష్ గత చిత్రం సర్కారు వారి పాట సినిమాలో కూడా మేసేజ్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ రావటమే ఇందుకు కారణం.

- Advertisement -

అసలే సినిమా చాలాసార్లు వాయిదా పడటంతో సినిమా మీద నెగిటివిటి నెలకొన్న క్రమంలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఫ్యాన్స్ ని మరింత టెన్షన్ కి గురి చేస్తోంది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి, త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు