Kareena – Saif : బాలీవుడ్ పవర్ కపుల్స్లో కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ జంట కూడా ఒకటి. ఇద్దరూ ఒకరిపై మరొకరు తమకున్న ప్రేమను చూపించుకోవడానికి దొరికే ఏ అవకాశాన్ని వదలరు. ఇటు కరీనా, అటు సైఫ్ తరచుగా ఇంటర్వ్యూలలో ఒకరినొకరు పొగుడుతుంటారు. అయితే తాజాగా బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల వీడియోపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కెమెరా ముందే ఇద్దరూ పబ్లిక్ గా లిప్ లాక్ పెట్టుకోవడంతో ఇంట్లో టైమ్ దొరకట్లేదా? పబ్లిక్ గా ఇలాంటి పనులు చేయడం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పబ్లిక్ గా లిప్ లాక్
ఓ బాలీవుడ్ మీడియాకు చెందిన సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేయగా, అందులో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు కనిపించారు. కరీనా కపూర్ తెల్లటి కుర్తా, డెనిమ్ జీన్స్ ధరించి కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ తెల్లటి కుర్తా, మ్యాచింగ్ కలర్ పైజామాలో దర్శనం ఇచ్చాడు. అలా వెళ్తూనే ఇద్దరూ కలిసి సడన్ గా లిప్ లాక్ పెట్టుకోవడం కెమెరా కంటికి చిక్కింది. మరి వాళ్లిద్దరికి అసలు వీడియో రికార్డు అవుతున్నట్టు తెలుసో లేదో.
కరీనా, సైఫ్ తీరుపై ట్రోలింగ్
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తాజా వీడియోను చూసిన తర్వాత స్టఫ్ దొరికింది అన్నట్టుగా నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ నెటిజన్ అయితే ఆ వైరల్ వీడియోపై ‘వారికి ప్రతిదీ షో చేయడంలోనే మాత్రమే ఆసక్తి ఉంటుంది అంటే, మరొకరు ఇంట్లో టైం దొరకడం లేదా అని కామెంట్స్ చేస్తున్నారు. ‘పబ్లిక్లో ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి?’ అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లు ఫోటోగ్రాఫర్ల ముందు ముద్దులు పెట్టికుని దారుణంగా ట్రోల్ అవుతున్నారు.
12 ఏళ్ల క్రితం సైఫ్ తో కరీనా రెండో పెళ్లి
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2012లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కరీనాతో సైఫ్ అలీఖాన్కి ఇది రెండో పెళ్లి. అమృతా సింగ్ను సైఫ్ మొదటి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని కరీనాను పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరి సినిమాల విషయానికొస్తే..
‘క్రూ’ సక్సెస్ తర్వాత కరీనా కపూర్ ఇప్పుడు రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’లో కనిపించనుంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన క్రూ థియేటర్లలో మంచి రెస్పాన్స్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 148 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఈ మూవీలో కరీనాతో పాటే కృతి సనన్, టబు హీరోయిన్లుగా నటించారు.
మరోవైపు సైఫ్ అలీఖాన్ ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సైఫ్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.