Mahesh Babu: గుంటూరు కారం గందరగోళం – ఏం జరుగుతుందో..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం షూటింగ్ లో ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోయినా తరచూ ఎదో ఒక గాసిప్ తో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన షెడ్యూల్ ని జులై మొదటివారంలో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ విషయంపై సినిమా యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు గానీ, సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చి ఇండైరెక్ట్ గా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉండగా, హీరోయిన్ పూజ హెగ్డేను కూడా ఈ సినిమా నుండి తప్పించారంటూ మరో వార్త వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పూజ స్థానంలో జాతిరత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా నటించనుందని సమాచారం అందుతోండగా మరో పక్క, ముందు సెకండ్ హిరోయిన్ గా అనుకున్న శ్రీ లీలనే మెయిన్ హీరోయిన్ అని కూడా టాక్ వినిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లో పట్టాలెక్కిన ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభం అయ్యిందో కానీ, అడుగడుగునా అవాంతరాలతో మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ సినిమా కథ విషయంలో కూడా డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబుకి మధ్య అబిప్రాయబేధాలు వచ్చాయని, కథలో మహేష్ సూచించిన మార్పులు చేయటంతో షూటింగ్ స్టార్ట్ చేశారని టాక్. ఆ తర్వాత గ్లింప్స్ రిలీజ్ కి ముందు కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సినిమా నుండి తప్పుకున్నాడంటూ గాసిప్స్ వచ్చాయి. ఇటీవల థమన్ చేసిన ట్వీట్ లు చూస్తే ఆ గాసిప్స్ కి బలం చేకూరే విధంగా ఉన్నాయి. ఇన్ని నెగిటివ్స్ మధ్య ఏదైనా పాజిటివ్ అంశం ఉందంటే, అది సినిమాపై ఆసక్తి పెంచిన టైటిల్ గ్లింప్స్ అని చెప్పాలి. మరి, త్రివిక్రమ్, మహేష్ ల కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమా విషయంలో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పడి అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు