హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్ళ దాటినా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటైన్ చేస్తూ అలరిస్తోంది హీరోయిన్ త్రిష. మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన పీఎస్ 2 సినిమా ఆశించిన స్థాయిలో టాక్ సొంతం చేసుకోలేకపోయినా, అందులో నటించిన త్రిష మాత్రం తన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ వంటి సత్ర్లు ఉన్నా కూడా ఎక్కువ ఫోకస్ త్రిషకు మాత్రమే దక్కింది. ఈ మధ్య త్రిష గ్లామర్ మరింత పెరిగిందంటూ నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ సమయంలో త్రిష మాత్రమే హైలైట్ గా నిలిచింది.
రెండు దశాబ్దాలకు పైగా అలరిస్తున్న త్రిష లాంగ్ స్పాన్ కెరీర్ ఉన్న అతి కొద్దీ మంది నేటి తరం హీరోయిన్స్ లో ముందుంటుంది. ప్రస్తుతం కోలీవుడ్లో వరుసగా సిన్మాలు చేస్తున్న త్రిష తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలో తమ అభిమాన హీరోయిన్ తెలుగు సినిమాలో మళ్ళీ ఎప్పుడు నటిస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు త్రిష అభిమానులు.
రెండు భాగాలుగా రూపొందిన పొన్నియన్ సెల్వన్ తమిళ్ లో హిట్ అయినప్పటికీ, తెలుగు సహా ఏ ఇతర భాషలో మెప్పించలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఇతర ప్రేక్షకులకు పరిచయం లేని కథ ఆధారంగా రూపొందించటం, పైగా ప్రమోషన్స్ కూడా ఎఫెక్టివ్ గా చేయకపోవటం అని చెప్పవచ్చు. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద సినిమా నిరాశపరిచినా ఫోకస్ మొత్తం త్రిషకి దక్కటం అదృష్టం అనే చెప్పాలి. మరి, తన సినిమా కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఫ్యాన్స్ ని త్రిష ఎప్పుడు అలరిస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News