Kollywood: ఐశ్వర్య కు ధనుష్ కంటే ముందే ఆ హీరోతో ఎఫైర్ ఉందా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా ధనుష్ తో ఐశ్వర్య కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2004 నవంబర్ 18న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ జంటకు యాత్ర మరియు లింగ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ధనుష్ – ఐశ్వర్య తమ 18 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఒక్కసారిగా చలనచిత్ర పరిశ్రమలో, అటు దేశవ్యాప్తంగా, అలాగే కోలీవుడ్ యావత్ సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే 2004లో వీరికి వివాహం జరిగే సమయానికి ధనుష్ వయస్సు 21 కాగా.. ఐశ్వర్య వయసు 23. అంటే ఐశ్వర్యతో పోలిస్తే ధనుష్ రెండు సంవత్సరాలు చిన్నవాడు. కాగా ధనుష్ నే చేసుకుంటానని ఐశ్వర్య పట్టుబట్టడంతో రజనీకాంత్ ఆమె కోరికను కాదనలేక ధనుష్ తో వివాహానికి ఒప్పుకున్నారు.

అయితే గతంలో సూచీ లీక్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పుడు శృతిహాసన్, అమలాపాల్ తో అతడికి ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినప్పుడే వాళ్ళు విడిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో రజిని జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో వారు కలిసి ఉన్నారు. అయితే ఐశ్వర్య కు కూడా ధనుష్ తో పెళ్లికి ముందు ఓ హీరోతో ఎఫైర్ నడిపిందన్న ప్రచారం అప్పట్లో జరిగేది. ఆ హీరో మరెవరో కాదు శింబు. ఐశ్వర్య శింబుతో ప్రేమలో ఉందని కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రేమ వార్తలు తెలిసి రజనీకాంత్ డిసప్పాయింట్ అయ్యారని కూడా న్యూస్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఐశ్వర్య శింబుకు దూరమైంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు