Power Star: ‘ఓజీ’లో బాలీవుడ్ ‘సీరియల్ కిస్సర్’..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ పవన్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాకు సంబంధించి సుజిత్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తి పెంచింది. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన మరో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అదేంటంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా నటించనుండటం.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుజిత్ గత చిత్రం సాహో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని బాగా హ్యాండిల్ చేశాడన్న ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా హిట్ వస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి సముద్రఖని డైరెక్షన్లో నటించిన బ్రో మూవీ జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా వస్తున్న బ్రో సినిమాకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా కోసమే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, రిలీజ్ కి ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు