Atlee : ఆ స్టార్ దర్శకుల రూట్లోనే అట్లీ..

Atlee : టాలీవుడ్ లోగాని సౌత్ ఇండియా లో గాని ఈ మధ్య స్టార్ హీరోలు, దర్శకులు నిర్మాతలు గానూ రాణించడం చూస్తూనే ఉన్నాం. ఇక హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండి నిర్మాతలుగా సినిమాలు తీయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న స్టార్ హీరోలు సైతం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సినిమాల నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఇక దర్శకులు కూడా నిర్మాణ రంగంలో చాలా మంది రాణిస్తున్నారు. ఒకప్పుడు ఇవివి లాంటి స్టార్ దర్శకులు మొదలుకొని, ఇప్పటి దర్శకులు రాజమౌళి లాంటి దర్శకులు కూడా అది కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఈ జెనరేషన్ లో రీసెంట్ గా స్టార్‌ దర్శకులు అంతా కూడా సొంత నిర్మాణ సంస్థలను మొదలు పెడుతున్నారు. సుకుమార్‌ ఇప్పటికే సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ పేరుతో పలు సినిమాలను నిర్మించి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. తన బ్యానర్‌ తో పలువురు దర్శకులను ఆయన పరిచయం చేసిన విషయం తెల్సిందే. ఇక తమిళ స్టార్ దర్శకుడు శంకర్ షణ్ముగం కూడా తాను నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ లింగుస్వామి లాంటి స్టార్ డైరెక్టర్లను పరిచయం చేసాడు. మురుగదాస్ కూడా జర్నీ లాంటి సినిమాలని నిర్మించాడు.

అగ్ర దర్శకుల నిర్మాణం..

రీసెంట్ గా సుకుమార్ మాత్రమే కాకుండా మరో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కూడా పరోక్షంగా హారిక హాసిని క్రియేషన్స్ లాంటి నిర్మాణ సంస్థల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా త్రివిక్రమ్ అనుబంధ నిర్మాణ సంస్థయే. వీళ్ళ కంటే ముందు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ రోజుల్లోనే వైష్ణో అకాడమీ పేరుతో పలు సినిమాలను నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఛార్మి కౌర్ తో కలిసి భాగస్వామ్యంగా సినిమాలు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా వీరి నిర్మాణంలో వస్తుంది. ఇక బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి నిర్మాత ముందుగా దర్శకుడిగా సినిమాలు తీశాకే నిర్మాత గా టర్న్ అయ్యాడని చాలా మందికి తెలియదు. ఇక సౌత్ లో ఇంకా చాలా మంది దర్శకులు కూడా తమ సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ బ్యానర్‌ లో ఈ మధ్య సొంత సినిమాల కంటే చిన్న సినిమాలనే ఎక్కువగా నిర్మిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కూడా ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు.

అట్లీ నిర్మాణంలో సినిమాలు..

కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ త్వరలోనే నిర్మాణ రంగంలోనూ రాణించడానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అట్లీ త్వరలో అల్లు అర్జున్ తో ఒక సినిమాను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆ సినిమా ఉంటుందని సమాచారం. అయితే ఈ లోపు ప్రొడ్యూసర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా అట్లీ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతోందట. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అట్లీ తన శిష్యుడు అయిన బాలాజీ ధరణీ ధరన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో రూపొందబోతుంది. ఇక స్క్రిప్ట్‌ విషయంలో అట్లీ తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా తన నిర్మాణం లో వచ్చే సినిమాల్లో తన క్రియేటివ్ మార్క్ ఉండేలా చూస్తాడని తెలిసిందే. అలాగే అట్లీ తన మార్క్ ఉండేలా చూస్తాడని తెలుస్తుంది. మరి అట్లీ ప్రొడ్యూసర్ గా ఈమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు