Biggboss season 7: యావర్ త్యాగానికి గ్రూపిజం పేరు పెట్టేసాడు?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం నామినేషన్స్ పూర్తవగానే ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో గత ఛాలెంజ్ ల లాగా కాకుండా ఎక్కువ ఛాలెంజ్ లు గేమ్స్ పెడుతూ, మెల్లి మెల్లిగా ఒక్కొక్కరిని గేమ్ నుండి తీసేయడం జరిగింది. ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ ఉన్న ఈ టాస్క్ లో ఇప్పటివరకు శివాజీ, శోభా, ప్రియాంక టాస్క్ నుండి తప్పుకోగా, తాజాగా ఈ టాస్క్ నుండి యావర్ కూడా తప్పుకున్నాడు.

అయితే ఈ టాస్క్ లో యావర్ సాధించిన పాయింట్లలో 130 పాయింట్లు ఎవరైనా ఆడుతున్న కంటెస్టెంట్ కి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా, యావర్ వెంటనే ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే అమర్ దీప్ మాత్రం తనకు యావర్ పాయింట్స్ ఇస్తాడని అనుకున్నాడు.

అందుకే ఆడుతున్నప్పుడే అమర్ గేమ్ నుండి బయటికి వస్తే తనకి ఆ పాయింట్స్ ఇమ్మని అడిగాడు. కానీ యావర్ ప్రశాంత్ కి ఇచ్చాడు.అయితే అమర్ ఇది గేమ్ అని అర్ధం చేసుకోకుండా యావర్ ని గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని శోభా ప్రియాంక ముందు చెప్తూ తిరుగుతున్నాడు. అయితే యావర్ ఎవరికీ ఇవ్వాలి అన్నది తన ఇష్టం.

- Advertisement -

ఇంతకు ముందు కూడా ప్రియాంక తన పాయింట్స్ ని గౌతమ్ కి ఇచ్చినపుడు అలాగే తప్పుగా అర్ధం చేసుకుని మిత్ర ద్రోహం చేసారని పెద్ద పెద్ద డైలాగులు పలికాడు. అయితే గేమ్ ప్రకారం బాగా ఆడుతున్న అమర్ ఆడియన్స్ లో మాత్రం ఇలా ట్రోలింగ్ కి గురవుతున్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు