Prabhas : ఆదిపురుష్ బాటలోనే సలార్

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నాడు. ‘బాహుబలి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు వరుసగా ప్లాప్స్ అవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ పడ్డారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ ఒకటి. ఇప్పటికే ఈ కాంబోపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘కే జి ఎఫ్ 2’ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి.

సలార్ లో ప్రభాస్ ను నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడో అని అభిమానులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. దాదాపు రూ. 270 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్తానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ప్రభాస్ చేసిన ఆది పురుష్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ఈ చిత్రంను వచ్చే ఏడాది జూన్ 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే ఈ చిత్రం కాస్త వాయిదా పడటంతో అందరి చూపు సలార్ వైపే ఉంది. సలార్ చిత్రంలో మేకర్స్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆదిపురుష్ వాయిదా పడటంతో సలార్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. కేవలం మూడు నెలల వ్యవధిలో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లను మేకర్స్ కోరుకోవడం లేదు. దీంతో సలార్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు