Bigboss Season 7: ఆ టాస్క్ లో గెలిచింది ఎవరు?

Bigboss Season 7:

బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వారం ఎవరికి వారు డిఫరెంట్ టాస్క్ లతో పరీక్షలు ఎదుర్కుంటూ బిగ్ బాస్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం బిగ్ బాస్ లో శివాజీ పవర్ అస్త్ర గెలుచుకున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్ర ఉండగా, మూడో పవర్ అస్త్ర గెలుచుకోవడానికి బిగ్ బాస్ అమర్ దీప్, శోభా శెట్టి, యావర్ లని నామినేట్ చేయగా, అందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వారు అర్హులు కాదన్న విషయం తెలిసిందే. అప్పుడు తాము అర్హులమని నిరూపించుకునే ప్రయత్నంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో యావర్ విన్ అవుతాడు.

ఇక ఇప్పుడు శోభా శెట్టి ని ఒక బౌల్ లో కారంతో ఉన్న చికెన్ ని తినమని చెప్తాడు. ఆమె ఎంత ఎక్కువ తింటే అంత పెద్ద టాస్క్ ప్రత్యర్థులకి వెళ్తుందంటాడు. ఆ తర్వాత శోభా ని నామినేట్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్ లని శోభా శెట్టి తిన్నంత చికెన్ ని అక్కడ పెట్టి ఇచ్చిన టైం లో ఎవరు ఎక్కువ చికెన్ తింటే వారు విన్ అయ్యి, శోభా ప్లేస్ లో పవర్ అస్త్ర కి నామినేట్ అవుతారు అని అంటాడు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో ముగ్గురు కష్టపడుతున్నా, అందులో ఈ టాస్క్ లో విన్ అయ్యింది శోభా శెట్టియే అని తెలిసింది. నిజానికి ఈ టాస్క్ లో గౌతమ్ దాదాపు విన్ అయినా, ఎదో చిన్న ముక్క సరిగా తినలేదని సంచాలక్ సందీప్ గౌతమ్ ని తప్పించాడు. అయితే నెటిజన్లు చాలా మంది రైతు బిడ్డ ప్రశాంత్ విన్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నా, అది జరగలేదు. అయినా ఎదుటివారిని తక్కువ అంచనా వేయలేం. ఈ టాస్క్ పోయినా వేరే టాస్క్ లో ఇతరులు మంచి పెరఫార్మన్స్ చేయొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు