సాధారణంగా ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమాని థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సినిమాలు ఇప్పుడు థియేటర్లలో విడుదలవ్వడం లేదు. నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాల కోసం క్యూ లైన్లు కట్టి మరీ నిలబడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. కొద్ది రోజులు అయితే అది ఎలాగో ఓటీటీలోకి వస్తుంది ఇంటి వద్ద చూడవచ్చు అనే భావనలో ఉన్నారు.
ఓటీటీలో సినిమాలతో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా విడుదలవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆహాలో వచ్చే బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్తో గత ఏడాది ప్రేక్షకులను మెప్పించడంతో ఈసారి సీజన్ 2లో కూడా రాణిస్తున్నారు. ఇటీవలే మొదటి ఎపిసోడ్కి చంద్రబాబు, లోకేశ్ వచ్చారు. రెండో ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ సందడి చేశారు. దీని తర్వాత మూడో ఎపిసోడ్ కి కాస్త గ్యాప్ ఇచ్చారు. మూడో ఎపిసోడ్ ని ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్కి శర్వానంద్, అడివిశేష్ గెస్ట్లుగా రానున్నారు.
అదే విధంగా బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలు కూడా ఈవారం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్ల వద్ద భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 9న థియేటర్ లలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. రేపటి నుంచి అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా కూడా రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం నుంచి ప్రీగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. సినిమా ఇది వరకే అమెజాన్ లోకి వచ్చింది. కానీ పే పర్ వ్యూ పద్దతిలో ఉంది. కానీ రేపటి నుంచి ప్రీగా ఈ సినిమాను చూడవచ్చు.
ఈ వారంతంలో ఓటీటీలో ఫుల్ క్రేజ్ ఉన్న చిత్రాలు, ఒక షో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.