Bimbisara : ఓటీటీ డేట్ పై క్లారిటీ

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ట దర్శకత్వంలో హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. సింపుల్ గా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పునః జన్మను ఇచ్చింది. ప్రేక్షకులను తిరిగి థియేటర్ కు రప్పించింది. ఇక సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వశిష్ట, సినిమాటోగ్రాఫర్, చోటా కె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు ఆసక్తికర వాక్యాలు చేశారు. 50 రోజుల తర్వాతనే బింబిసారను ఓటీటీలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అప్పటివరకు థియేటర్లలోనే ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ క్రూరమైన రాజు పాత్రలో బాగా యాక్టింగ్ చేశారని చెప్పారు. సినిమా స్టోరీ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారని బింబిసార, సీతారామం నిరూపించాయని అన్నారు. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు ఊపిరి పోశాయని అన్నారు.

ఇక హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మళ్ళీ జన్మనిచ్చినట్లు అనిపించిందని చెప్పారు. ఇంత మంచి కథను తనకు ఇచ్చిన వశిష్టకు, సినిమాను చూసి నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన మా దిల్ రాజు ధన్యవాదాలు చెప్పాడు. త్వరలోనే బింబిసార2తో మరింత పవర్ ఫుల్ గా వస్తామని వెల్లడించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు