Hanu Raghavapudi : బంపర్ ఆఫర్ ?

హను రాఘవపూడి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఇదే పేరు వినిపిస్తుంది. సీతారామంతో ప్రేక్షకులకు క్లాస్ లవ్ స్టోరీని చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో సోషల్ మీడియాలో హను రాఘవపూడి ని ట్యాగ్ చేస్తూ చాలా మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. స్టోరీ ఉంటే, ప్రేక్షకులు థియేటర్ కు వస్తారని నిరూపించింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన హను రాఘవపూడికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. విభిన్న సినిమాలను నిర్మించి, హిట్స్ కొడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ తో హను రాఘవపూడి తర్వాత సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని కోసం హను ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్. స్టోరీని, హీరో హీరోయిన్స్ ను రెడీ చేసుకుంటే, సినిమా స్టార్ట్ చేద్దామని కూడా మైత్రీ చెప్పినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్.. శ్రీమంతుడు మూవీతో నిర్మాణ సంస్థగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట లాంటి సినిమాలను మైత్రీ బ్యానర్ లో వచ్చాయి. వీటితో పాటు మరి కొన్ని క్రేజీ సినిమాలు ఈ బ్యానర్ లో వస్తున్నాయి. ప్రస్తుతం NBK107 తో పాటు పుష్ప ది రూల్ లాంటి భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. కాగా పుష్ప – 2 దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు