Chiranjeevi : ఎలాంటి అభ్యంతరం లేదు

మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమేక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు.

మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేశారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో గ్రాండ్ గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని చిత్ర బృందం ఎంజాయ్ చేస్తోంది. ఇక మెగాస్టార్ అయితే మీడియాతో మంచి యాక్టివ్ గా కూడా ఉన్నారు. అలా లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకోగా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో మన సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లు ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టగా, తన ఎంట్రీ ప్రశ్నపై అయితే చిరు ఓ క్లారిటీ ఇచ్చారు.

ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంచి సబ్జెక్టు దొరికితే అందులో కూడా డెఫినెట్ గా చేస్తానని తెలిపారు. అంతేకాకుండా లాక్ డౌన్ స‌మ‌యం లో తాను ఏవో ఒప్పుకున్నట్టు వచ్చిన వార్తలు అయితే అవాస్తవం అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను స్మాల్ స్క్రీన్ పై మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారని కూడా గుర్తు చేశారు. మరి ఓటీటీ ఎంట్రీ అయితే బాస్ నుంచి ఎప్పుడు ఉంటుందో చూడాలి. కాగా.. ప్రస్తుతం చిరు, మెగా 154 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు