టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ జోష్ లో ఉంది. ముంబై కి చెందిన ఈ బ్యూటీ మూగమూడి అనే తమిళ సినిమా తో ఫిల్మ్ ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. డీజే, అరవింద సమెత, అలవైకుంఠ పురంలో సినిమాలతో స్టార్ హీరోయిన్ గా తెలుగులో పాగా వేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే.. మహేష్ బాబు సినిమా SSMB 28 లో, పవన్ కళ్యాణ్ తో మరో సినిమా లోను నటిస్తుంది.
అయితే పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ కిసి కా భాయ్ కిసి కా జాన్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21 న విడుదలవుతుంది. అయితే మాములుగా ఏ హీరోయిన్ కి అయినా బాలీవుడ్ లో మూవీస్ చెయ్యాలని, అక్కడి సినిమాలతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించొచ్చని అనుకుంటూ ఉంటారు. అలాగే పూజా కూడా 2016 లోనే మోహింజదారో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ భామ బాలీవుడ్ ఆశలు ఆవిరైపోయాయి. ఆ తర్వాత హౌస్ ఫుల్4, రీసెంట్ గా సర్కస్ మూవీలతో పలకరించింది. ఈ మూవీస్ కూడా ప్లాప్ అయ్యి పూజా కి హిందీలో ఐరెన్ లెగ్ అని టాగ్ తెచ్చి పెట్టాయి .
ఇప్పుడు పూజా హెగ్డే మరోసారి కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. పైగా పూజ హెగ్డే నటించిన రీసెంట్ మూవీస్ అన్ని ప్లాప్ అయ్యాయి. కాబట్టి తనకి ఇప్పడు ఒక సాలిడ్ హిట్ అవసరం. ఈసారి పెద్ద సినిమాతో వస్తున్నందువల్ల ఎలాగైనా హిట్ వస్తుందని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తోనైనా పూజా బాలీవుడ్ లో స్టార్ అవ్వాలన్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News