టాలీవుడ్ యంగ్ హీరో విజయ్దేవరకొండ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విజయ్ దేవరకొండ- పూరిజగన్నాథ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవల్లో లైగర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 25న ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందనే చెప్పాలి. కాకపోతే కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే పూరిజగన్నాథ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ ను విజయ్తో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్టు వార్తలు వినిపించాయి. లైగర్ సినిమా ఆశించిన మేరకు ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో జనగణమనని నిర్మాతలు దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. లైగర్ తరువాత పూరీ, చార్మీలు సైతం ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ మాత్రం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సైమా వేడుకలకు హాజరయ్యాడు విజయ్. అక్కడి మీడియా జనగణమన సినిమా గురించి ప్రశ్నించగా.. అవన్ని ఇప్పుడు ఎందుకు..? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ‘జనగణమన’ గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి అని విజయ్ సమాధానం ఇచ్చాడు. వాస్తవంగానే జనగణమన ఆగిపోయిందని.. అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.