Balagam: సాయిలు పాత్రకు ఫస్ట్ ఎంపిక ప్రియదర్శి కాదా ?

తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన చిత్రం బలగం. జబర్దస్త్ ఫేం వేణు ఈ సినిమా దర్శకుడు. మార్చి 3వ తేదీన విడుదలైన ఈ చిత్రాన్ని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మించింది. కాకి పిండం ముట్టకపోతే అనే కాన్సెప్ట్ తో వచ్చిన బలగం ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ఈ చిన్న సినిమాకు కలెక్షన్లు కూడా పెద్ద మొత్తంలోనే వచ్చాయి. 25 రోజుల్లో బలగం చిత్రానికి 24.29 కోట్ల గ్రాస్‌ వచ్చింది. అందులో 11.14 కోట్ల షేర్‌.

నైజాంలో 16.75 కోట్లు, ఆంధ్రా, సీడెడ్‌లో 7.54 కోట్లు, ఇక ఏపీ తెలంగాణలో మొత్తంగా 24.29 కోట్ల గ్రాస్, 11.14 కోట్ల షేర్ వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్‌ కలుపుకుని 42 లక్షలు. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 24.71 కోట్ల గ్రాస్ వచ్చింది. కాగా 11.33 కోట్ల షేర్ వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ 1.30 కోట్లు. ఇక ఈ సినిమా మొత్తం లాభం 10.03 కోట్లకు పైనే ఉంది. ఇది ఇలా ఉండగా, బలగం సినిమాలో అన్ని పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి చేసిన సాయిలు పాత్ర కీలకం. క్లైమాక్స్ లో ప్రియదర్శి నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సాయిలు పాత్రకు ముందుగా ప్రియదర్శిని అనుకోలేదట.

డైరెక్టర్ వేణు బలగం స్టోరీని దిల్ రాజు కు చెప్పిన సమయంలో సాయిలు పాత్రను వేణునే చేయాలని అనుకున్నారట. కానీ, తర్వాత ఇతర నటుడిని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్ధేశ్యంతో ప్రియదర్శి పేరును దిల్ రాజు సూచించారట. అలా సాయిలు పాత్ర తన వరకు వచ్చిందని స్వయంగా ప్రియదర్శి చెప్పాడు. ఒక వేళ వేణునే సాయిలు పాత్ర చేసి ఉంటే, ఒక మంచి సినిమాలో తాను భాగం అయ్యే వాడిని కాదని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు