స్టార్ నటీ, నటులు అయినటువంటి చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్వరాయ్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్. భారీ అంచనాలతో ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జరిగింది.
ఈవెంట్ లో విక్రమ్ మాట్లాడుతూ.. మీరు తెలుగు ప్రేక్షకులు కాదు.. సినిమా ప్రేక్షకులు. మీరంతా సినిమా పిచ్చోళ్లు.. నాకు ఒక్కో సినిమాలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. నాన్న అంటే ఎమోషన్, శివ పుత్రుడు అంటే ఫైట్, అపరిచితుడు అంటే పెర్ఫార్మన్స్. ఒక్కో నటుడికి ఒక్కో స్పెషల్ ఉంటుంది. నాకు ఈ సినిమాలో ఒకే ఒక షాట్ ఉంటుంది. అది చాలు అదే ట్రైలర్ చూపించింది. ఇక క్యాస్ట్లో అంత స్పెషల్ ఏంటంటే నాకు తెలిసి ఇది ఒక రికార్డు.. లోకంలో ఎక్కడ లేని రికార్డు.. ఈ సినిమాలో అందరూ హీరోలు.. అందరూ హీరోయిన్లే.. ఈ సినిమా కోసం అందరం కలవడానికి దర్శకుడు మణిరత్నం గారే అని చెప్పుకొచ్చారు విక్రమ్.
ముఖ్యంగా మణిరత్నం గారి డ్రీమ్ ప్రాజెక్ట్లో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు విక్రమ్. ముఖ్యంగా ఈ సినిమాలో విక్రమ్ గుర్రం మీద వస్తున్న సీన్ సినిమాకే హైలెట్ కానుందని సమాచారం. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకు వేచి చూడాల్సిందే.