Vijay Devarakonda : పాపం కొండన్న కాన్ఫిడెన్స్ ను గట్టిగానే కొట్టాడు పూరీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కుకోవడానికి ఈ యంగ్ హీరో చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. కానీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. అయితే గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన సైలెన్స్ కు రీజన్ ఏంటో తాజాగా బయటపడింది. ఇంతకీ విజయ్ దేవరకొండ ప్లాన్ ఏంటి? ఆయన సైలెన్స్ వెనుక కథ ఏంటి.? అంటే…

ఓవర్ కాన్ఫిడెన్స్ కు కేరాఫ్ అడ్రస్
టాలీవుడ్ లో ఉన్న ఆటిట్యూడ్ స్టార్ ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. స్టేజ్ పై ఆయన మాట్లాడే తీరు, ఓవర్ కాన్ఫిడెన్స్, చూపించే ఆటిట్యూడ్ కారణంగానే ఈరోజు రౌడీ హీరో ఈ స్టేజిలో ఉన్నాడు అనేది నిజం. కానీ గత కొంతకాలంగా కంటిన్యూగా ఫ్లాఫ్స్ అందుకుంటున్న విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గినట్టుగా అనిపిస్తోంది. అయితే కొండన్న కాన్ఫిడెన్స్ ను అంత గట్టిగా దెబ్బ కొట్టింది డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కావడం విశేషం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ “లైగర్” విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ మీద నమ్మకంతో ఆయన చేతిలో తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీని పెట్టాడు ఈ హీరో. కానీ ఆ మూవీ ఇచ్చిన ఊహించని షాక్ నుంచి ఇంకా విజయ్ దేవరకొండ తేరుకోలేదు. ఇక గత చిత్రం “ఖుషి” రిలీజ్ టైంలో కూడా రౌడీ హీరో స్ట్రాంగ్ గానే కనిపించాడు. కానీ ఆ మూవీ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు.

రౌడీ హీరో సైలెన్స్ కు ఇదే కారణం
విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూడు సినిమాల విషయంలో సైలెంట్ గా ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. “లైగర్” మూవీ నేర్పించిన గుణపాఠంతోనే ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఇక రానున్న సినిమాల్లో తాను కాకుండా తన వర్క్ మాట్లాడుతుందని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ “ఖుషి” సినిమా రిజల్ట్ తర్వాత ఇప్పుడు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ హీరో. ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. తన మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా షేర్ చెయ్యట్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాలపైనే కాన్సెంట్రేట్ చేశాడు. ఆ షూటింగుల్లోనే బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

- Advertisement -

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీస్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ రూపొందుతోంది. పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ రౌడీ బాయ్ నెక్స్ట్ మూవీ చేయనున్నాడు. అనంతరం ముగ్గురు డైరెక్టర్స్ ను విజయ్ దేవరకొండ లైన్లో పెట్టినట్టు సమాచారం. “రాజా వారు రాణి” గారు ఫేమ్ రవికిరణ్ కోలా, కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ ముత్తేశ్వరన్, కన్నడ డైరెక్టర్ నార్తన్ తో వరుసగా సినిమాలు చేయనున్నాడు రౌడీ హీరో.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు