BRO: వరుస పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తున్న బాలీవుడ్ నటి

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయిన, యూట్యూబ్ రికార్డ్స్ అయిన, ట్విట్టర్ లో ట్రెండ్స్ అయిన, ఇలా విషయం ఏదైనసరే అక్కడ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు అదొక రికార్డ్ అయిపోతుందనడంలో సందేహమే లేదు.

అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కేవలం టాలీవుడ్ ప్రేక్షకులకి మాత్రమే తెలుసనుకుంటే పొరపాటే.. టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలోను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేవాళ్లు ఉన్నారు. గతంలో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ క్రేజ్, ఆయన పొలిటికల్ ఎంట్రీతో అది మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం పవన్ రాజకీయాలతో పాటు, వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో ది అవతార్ అనే సినిమా షూటింగ్ కంప్లిట్ చేయగా, ఈ సినిమా వచ్చే జులై 28న రిలీజ్ కి రెడీ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి రచన సహకారం అందించగా, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ బ్రో మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.కాగా ఈ సినిమా క్లైమాక్స్ లో పవన్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసాడంట గురూజీ.  ఈ సాంగ్ లో పవన్ సరసన చిందులెయ్యడానికి బాలీవుడ్ యాక్టర్ ఊర్వశి రౌతేలని మూవీ టీం సంప్రదించగా, ఆమె కూడా వెంటనే ఈ సాంగ్ చేయడానికి ఓకె చెప్పిందట.అయితే ఈ సాంగ్ కి సంబంధించి భారీ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ వేస్తున్నారు. సెట్ రెడీ అవ్వడానికి ఇంకా కాస్త సమయం ఉండటంతో ఊర్వశి రౌతేల పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆయన గత సినిమాలని చూడటం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఖుషి సినిమా చూసేసిన ఈ బ్యూటీ లేటెస్ట్ గా బద్రీ సినిమా కూడా చూడటం స్టార్ట్ చేసినట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది. దాంతో ఆమె అకౌంట్ త్రేడ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత చేరి ఫలానా ఈ సినిమా చూడు, ఆ సినిమా చూడు అంటూ ఈ బ్యూటీకి ఫ్రీ గా మూవీ సజెషన్స్ ఇస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు