Trisha : ఊహ‌కు అంద‌ని విష‌యం

ప్ర‌ముఖ హీరోయిన్ త్రిష గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఆమె తొలుత టాలీవుడ్‌లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన వ‌ర్షం సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ త‌రువాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తూనే ఉంది. మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఇచ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చి వరుస‌ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు నాలుగు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఇప్ప‌టికీ యువ క‌థానాయిక‌ల‌కు పోటీనిస్తుంది ఈ బ్యూటీ.

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్‌ని సంపాదించుకుంది. కొద్ది కాలం సినిమాల‌కు దూరంగా ఉండి ఇటీవ‌లే ’96’ సినిమాతో మ‌ళ్లీ రీ ఎంట్రి ఇచ్చింది. తాజాగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంలో న‌టించింది. ఇందులో త్రిష యువ‌రాణి కుంద‌వై పాత్ర‌లో క‌నిపించి అంద‌రినీ మెప్పించింది. సెప్టెంబ‌ర్ 30న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. విడుద‌లైన తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుకుంది.

తాజాగా త్రిష ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే ప్ర‌పంచం మొత్తం క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నేను నా ఖాళీ స‌మ‌యాన్ని ర‌చ‌యిత క‌ల్కి రాసిన పొన్నియిన్ సెల్వ‌న్ పుస్తకం మొత్తం చ‌దివాను. చ‌రిత్ర కి సంబంధించిన పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని నేను భావిస్తాను. ఆ న‌వ‌ల మాత్రం చాలా ఆస‌క్తిగా ఉంది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే 5 భాగాలు ఉన్న పుస్త‌కాన్ని కేవ‌లం రెండు భాగాల్లో చూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది నాకు ఊహ‌కు అంద‌ని విష‌యం అని చెప్పుకొచ్చింది త్రిష‌. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వ‌చ్చిన ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌, కార్తి, జ‌యంర‌వి, శ‌ర‌త్ కుమార్‌, శోభితా ధూళిపాళ్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు