విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించారు. జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆమె మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విదేశాల్లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కంఠంనేని ఉమామహేశ్వరి మరణం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు. ఈ వివాహం జరిగిన రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం కుటుంబ సభ్యులను కలిచివేస్తుంది.