టాలీవుడ్ లో టాప్ హీరోలనుంచి రాను రాను సినిమాల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు టాప్ హీరోల నుండి రెండు నుంచి మూడు సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత రెండు కంటే తక్కువగా, ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా రావడమే కష్టమయిపోయింది. బాహుబలి తర్వాత అందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉండడంతో భారీ ఖర్చుతో మెల్లిగా తీస్తున్నారు. బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వాలన్న తాపత్రయంలో అభిమానుల్ని నిరాశకి గురి చేస్తున్నారు.
ఇక 2023లో ఇప్పటివరకు ఒక్క టాప్ హీరో సినిమా కూడా రాలేదు. టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు నటిస్తున్న “గుంటూరు కారం” 2024 సంక్రాంతికి రాబోతుందని మేకర్స్ ఇప్పటికే తెలియచేసారు. కాబట్టి మహేష్ సినిమా 2023 లో లేదు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తుండగా ఆ సినిమా 2025 లో వస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న “దేవర” ఈ ఏడాదే షూటింగ్ మొదలవగా 2024 సమ్మర్ లో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప ది రూల్” 2024 లోనే విడుదల చేస్తామని సుకుమార్ టీజర్ రిలీజ్ తో చెప్పకనే చెప్పాడు.
అయితే ఈ ముగ్గురి హీరోలకంటే రెండేళ్ల కిందటే ప్రారంభమైన రామ్ చరణ్ “గేమ్ చేంజర్” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ బర్త్ డే రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఈ సినిమా 2024 లోనే ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇది కాకుండా రామ్ చరణ్ వేరే సినిమా కూడా చేయలేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు.
అయితే ఈ ఏడాది తమ సినిమాలతో పలకరిస్తున్న టాప్ హీరోలు ఇద్దరే. వారే పవన్ కళ్యాణ్, ప్రభాస్. వీరిలో ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమా పూర్తి చేయగా జూన్16 న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత “సలార్” షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ సినిమాను కూడా ఈ ఏడాదే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” షూటింగ్ దాదాపుగా పూర్తవగా జులై 28న విడుదల అవుతుంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ను కూడా 2023 చివర్లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు.
ఓవరాల్ గా 2023లో టాప్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ నుండి సినిమాలు రావట్లేదని అఫిషియల్ గా తేలిపోయింది. అంటే ఈ ఏడాది అభిమానులని పలకరించేది ప్రభాస్, పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నమాట.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News