Sudigali Sudheer : కళ్ళతోనే ఫీలింగ్స్ చెప్తాం

సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈయన వివిధ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. బుల్లితెర నుంచి వెండితెర పైకి వచ్చిన ఆర్టిస్టులలో సుధీర్ ఒకరు. ఒక్కో సినిమా చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకోవడానికి సుధీర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం ” గాలోడు”.

రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ గెహనాసిప్పి హీరోయిన్ గా నటించింది. సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 375 థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడిన సుధీర్.. బుల్లితెరపై రష్మి తో కెమిస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రష్మీ ని అడిగారట. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయిందని సుదీర్ చెప్పుకొచ్చాడు.

“నాకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇష్టం ఉండదు. కానీ అది రష్మితో ఎలా వర్కౌట్ అయిందంటే..? మేము ఇద్దరం ఎప్పుడు ముట్టుకోం.. పట్టుకోం.. కేవలం కళ్ళతోనే మా ఫీలింగ్స్ ని చెప్పేందుకు ట్రై చేస్తాం. అదే వర్కౌట్ అయింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మళ్లీ జబర్దస్త్ లో చేసేందుకు రెడీ గా ఉన్నాను. వాళ్లకి చెప్పే ఈ ఆరు నెలలు బ్రేక్ తీసుకున్నాను” అని వెల్లడించాడు. మరి ఈ గాలోడు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు