మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీని దర్శకుడు శంకర్తో కలిసి చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ‘RC15’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కె ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉండనుందట. భారత స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులను భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి సుభాస్ చంద్ర బోస్ చేసిన పోరాటం గురించి అందరికీ తెలిసిందే. బోస్ నుంచి ప్రేరణ పొందిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రం యొక్క ప్లాష్ బ్యాక్కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుభాస్ చంద్రబోస్ పాత్రను కూడా పెట్టారట.
ఈ సినిమా సెకండాఫ్లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్లో చంద్రబోస్ కనిపించనున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి చాలా కీలకమట. ఈ చిత్రంలో రామ్చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలీష్గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చరణ్ స్పెషల్ లుక్ కోసం డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ తెరకెక్కించేందుకు దాదాపు 1000 మంది ఫైటర్లు పాల్గొనబోతున్నారట. కేవలం ఒక్క యాక్షన్ సీన్ కోసమే ఏకంగా రూ.10కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ బడ్జటె తో వచ్చే ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదలయ్యేంత వరకు వేచి చూడాలి.