Srikanth-Ooha : డైవర్స్ పుకార్లకు బ్రేక్

ప్రస్తుత కాలంలో రూమర్స్ రావడం సర్వ సాదారణం అయిపోయింది. నిజంతో సంబంధం లేకుండా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నగా ఎక్కడో స్టార్ట్ అయి.. చిలికి చిలికి గాలివానల తయారువుతున్నాయి. అడ్డు అదుపు లేకుండా వచ్చే ఈ రూమర్స్ సెలబ్రెటీలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అని, సెలబ్రెటీలు విడిపోతున్నారు అంటూ వచ్చే ఫేక్ న్యూస్ లు అయితే ఇంకా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి.

ఇటీవల టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీరు డైవర్స్ కు కూడా అప్లే చేసుకున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రాసుకొచ్చాయి. తాజాగా వీటిపై శ్రీకాంత్ స్పందించాడు. “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను. గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఈ ఫేక్ న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది” అని చెప్పారు.

అలాగే తాను ఊహాతో కలిసి చెన్నైకి వెళ్లామని, అక్కడి నుండి అరుణాచలం వెళ్తున్నట్టు వివరించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావొద్దని తాము స్పందింస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అలాగే తన మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా బండ్ల గణేష్ కూడా శ్రీ కాంత్, ఊహ లకు వీడియో కాల్ చేసినట్టు ట్విట్టర్ లో తెలిపాడు. శ్రీకాంత్, ఊహతో మాట్లాడినట్టు కూడా ఒక ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఈ ఇద్దరు విడిపోతున్నారు అంటూ వచ్చిన వార్తలకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు