Sri Simha: ఆస్కార్ గ్రహీత వారసుడిపై సుకుమార్ ఫైర్.. కారణం..?

Sri Simha.. డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ఎక్కువగా సంగీతాన్ని అందించేది ఎంఎం కీరవాణి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. రాజమౌళి సినిమాలకు ఇది మరింత ప్లస్ గా మారుతూ ఉంటుంది. అందుకే రాజమౌళి – కీరవాణి కాంబినేషన్లో వచ్చే ఎలాంటి సినిమా అయినా సరే కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతూ ఉంటుంది..ఇక ఈ నేపథ్యంలోనే గత రెండువేల క్రితం తెరకెక్కించిన RRR చిత్రానికి గానూ ఆస్కార్ అవార్డును అందుకున్నారు కీరవాణి. దీంతో తెలుగు ఇండస్ట్రీ ని మరో మెట్టు పైకి తీసుకువెళ్లారు కీరవాణి. ఈయన కొడుకు శ్రీ సింహ ప్రస్తుతం హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.

Sri Simha: Sukumar fire on Oscar winner's heir.. Reason..?
Sri Simha: Sukumar fire on Oscar winner’s heir.. Reason..?

సక్సెస్ కోసం శ్రీ సింహ ఎదురుచూపులు..

శ్రీ సింహ గతంలో చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ హీరోగా మాత్రం “మత్తు వదలరా” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల తను నటించిన ఉస్తాద్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు తన చేతిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సరైన సక్సెస్ కోసం శ్రీ సింహ ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుండగా శ్రీ సింహ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను తెలియజేశారు.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని

ముఖ్యంగా శ్రీ సింహ హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేసినట్టుగా వెల్లడించారు.. ఆ సమయంలో తాను సరిగ్గా కాలేజీకి వెళ్లడం ఇష్టం లేదని..ఒకవేళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కాలేజీకి వెళ్లమనో లేకపోతే ఏదో ఒక పని చేయమనో చెబుతూ ఉంటారని తెలిపారు శ్రీ సింహ. చిన్న వయసు నుంచి తన కుటుంబం కూడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో తనకు కూడా సినిమాలు చేయడం అంటే ఇష్టం అని తెలిపారు.. అయితే తన తండ్రి పేరు వాడకుండా ఏదో ఒకటి చేయాలని డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరానని తెలిపారు శ్రీ సింహ.

- Advertisement -

శ్రీ సింహ పై సుకుమార్ ఫైర్..

అందుకు సుకుమార్ కూడా ఓకే చెప్పారని.. రంగస్థలం సినిమాకు సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని తెలిపారు. అయితే అలా జాయిన్ అయిన తర్వాత సుకుమార్ కు తాను కీరవాణి కొడుకు అన్నట్లుగా ఎలానో తెలిసిందని.. సుకుమార్ పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని..ఆ సందర్భంలోనే రెండు మూడు సార్లు తనని తిట్టారని కూడా తెలియజేశారు. కానీ ఆ తర్వాత తనకు సారీ కూడా చెప్పేవారని.. వర్క్ టెన్షన్లో ఏదో మాట్లాడినా ఆ తర్వాత అక్కడున్న వారందరికీ మళ్ళీ సారి చెబుతూ ఉంటారని తెలిపారు శ్రీ సింహ.

దర్శకుడుగా చేయాలన్నదే కల..

రాబోయే రోజుల్లో కచ్చితంగా తాను కూడా డైరెక్టర్గా ఒక సినిమా చేయాలని ఉందంటూ తెలియజేశారు శ్రీ సింహ.. హీరోగా ప్రస్తుతం అయితే సినిమాలు చేస్తున్నాను కానీ ఎప్పటికైనా తన డైరెక్షన్లో ఒక సినిమా వస్తుందంటూ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు