Samyuktha: కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

Samyuktha.. ఈమధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు తమ కెరియర్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డింపుల్ హాయతి , అషు రెడ్డి , రష్మిక మందన్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు తమ కెరియర్ కోసం ప్రత్యేక పూజలు చేయించుకుని ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు.. అయితే ఇదిలా ఉండగా తాజాగా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంయుక్త మీనన్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.. అయితే ఆమె ఏ ఉద్దేశంతో.. ఏ లాభం కోరి పూజలు చేయించింది అనే విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Samyuktha: Special pooja in Kamakhya temple.. What is the reason..?
Samyuktha: Special pooja in Kamakhya temple.. What is the reason..?

కామాఖ్య దేవాలయంలో సంయుక్త పూజలు..

సంయుక్త తాజాగా అస్సాంలోని ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ గుడికి ఒక ప్రతిష్టత ఉంది. ఈ దేవాలయానికి పెళ్లి కావాలనుకునే మహిళలు… పెళ్లయిన తర్వాత పిల్లలు కోరుకునే మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు సంయుక్త ఈ గుడికి ఏం కోరుకోవడానికి వెళ్లిందో తెలియదు కానీ ఇప్పుడు ఆమె ఆ గుడిలో కనిపించి అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యేలా చేసింది.. వాస్తవానికి సంయుక్త మీనన్ కు భక్తి ఎక్కువ.. అతి పురాతనమైన దేవాలయం సందర్శించడంలో ఆమె ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.. అందులో భాగంగానే 51 శక్తి పీఠాల్లో నాలుగో శక్తి పీఠంగా గుర్తింపు తెచ్చుకున్న కామాఖ్యా దేవాలయాన్ని ఆమె దర్శించుకున్నారు.. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు దేవాలయాలను దర్శించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా అస్సాంలోని ఈ దేవాలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది..

వారి బాటలోనే సంయుక్త పూజలు..

ఇకపోతే ఇప్పటికే ఈ దేవాలయానికి తమన్నా, కంగనా రనౌత్ , సోనాల్ చౌహన్, ఊర్వశి రొట్టెల వంటి వారు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.. వాళ్ల కెరియర్ డౌన్ లో ఉన్నప్పుడు ఈ దేవాలయంలో పూజలు నిర్వహించి మంచి ఫలితాలను పొందారు.. ఇప్పుడు సంయుక్త కూడా బాలీవుడ్ వెళ్లే ప్రయత్నంలో ఉంది కాబట్టి అక్కడ తనకంతా మంచే జరగాలని. మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ …ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో తెలియాలి అంటే సంయుక్త ఈ విషయంపై స్పందించక తప్పదు..

- Advertisement -

సంయుక్త టాలీవుడ్ కెరియర్..

రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్.. ఇందులో పాన్ ఇండియా హీరో రానా కూడా నటించారు.. ఈయనకు భార్య పాత్రలో నటించి.. తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్.. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. సార్ , విరూపాక్ష సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.. అక్కడ సక్సెస్ సాధించాలని ఆశపడుతోంది. అందుకే కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.. మరి అమ్మవారి ఆశీస్సులు సంయుక్త పై ఏ విధంగా ఉంటాయో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు