ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్లలో దివంగత నటి సౌందర్య ఒకరు. ప్రస్తుతం సౌందర్య మన ముందు లేకపోయినప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది. దాదాపు 10 ఏళ్లు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో పదుల సంఖ్యలో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అంతేకాదు పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనూ నటించి మెప్పించింది సౌందర్య. అలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అనుకోని ప్రమాదంలో మరణించింది.
ఆమె మరణించి దాదాపు 19 ఏళ్లు పూర్తయిపోయాయి. అయినప్పటికీ సౌందర్య గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె మరణం గురించి ఇప్పటికీ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ సినిమాలో నటించినందువల్లే సౌందర్య మరణించింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సౌందర్య జన్మించిన సమయంలోనే ఆమె తండ్రి జాతకం రాయించినప్పుడు ఓ విషయాన్ని సౌందర్య తండ్రికి జ్యోతిష్యులు చెప్పారట. ఆమె జాతకం చాలా బలమైందని, మంచి పేరు ప్రఖ్యాతలు గావిస్తుందని తెలిపారట. కానీ మధ్యలోనే ఆమె మరణిస్తుందని తెలిపారట జ్యోతిష్యులు.
అయితే వారు చెప్పినట్లుగానే జరిగిందని సౌందర్య తండ్రి ఒకానొక సందర్భంలో తెలిపారు. తెలుగులో చంద్రముఖిగా వచ్చిన మూవీని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగవల్లి పాత్రలో నటించింది సౌందర్య. అయితే ఈ సినిమాలో నటించినప్పుడు ఆ పాత్రలో లీనమైపోయిందట సౌందర్య. అలా నాగవల్లి పాత్రలో నటించడం వల్లే సౌందర్య మరణించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రలో ఏదో బలమైన శక్తి ఉందని, సౌందర్య మరణించడానికి ఆ శక్తి కారణమైందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఆప్తమిత్ర 2 లో హీరోగా నటించిన విష్ణువర్ధన్ కూడా ఆ సినిమా చేసినన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నారు కానీ సినిమా తర్వాత ఆకస్మికంగా మరణించారట.
ఇక నాగవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పిన శశికళ కూడా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎన్నో పాత్రలకు డబ్బింగ్ చెప్పాను కానీ నాగవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పిన తర్వాత తన చుట్టూ ఏదో శక్తి ఉన్నట్లు అనిపిస్తుందని, ఒకానొక సందర్భంలో తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని తెలియజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News